కనేకల్లు ప్రజాతేజం ఏప్రిల్ 09
కనేకల్ మండల పరిధిలోని గెనిగెర గ్రామం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లో ఫాదర్ ఫెర్రర్ 105 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ విచ్చేసి ఫాదర్ ఫెర్రర్ కి నివాళులర్పించారు. మేజర్ గ్రామ పంచాయతీ యెర్రగుంట గ్రామ సర్పంచ్ వన్నూరమ్మ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి ఫాదర్ ఫెర్రర్ కు నివాళులు అర్పించారు. వైసిపి మండల కార్యదర్శి హనుమంతు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు .
ఫాదర్ ఫెర్రర్ 105 వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అనాధ పిల్లల చవుల సహాయార్థం కోసం తమ వంతు చందాగా రెండువేల రూపాయలను సంస్థ వారికి అందజేశారు