విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 11 అలంకరణలతో పూజలందుకున్న దుర్గమ్మకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనా నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకరణలో ప్రజలకు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. యాత్రిలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి ఆనం తెలిపారు.